Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

చేసిన అభివృద్ధిని సెల్ఫీలలో చూపిస్తున్నాం పార్థసారథి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం మంగళవారం నిర్వహించి పెనుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాములో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియచేస్తూ స్థానిక శాసనసభ్యుడు శంకర్ నారాయణ పై ధ్వజమెత్తారు ఆయన గతంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించ సాగారు నియోజకవర్గములో ఎవరు అభివృద్ధి చేసారో ప్రజలకు తెలుసు, నువ్వు ప్రభుత్వము నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేని అసమర్ధుడు నువ్వు. మేము చేసిన అభివృద్ధికి తార్కాణం ఒకటి పెనుకొండలో దక్షిణ కొరియాకు చెందినటువంటి 13000 వేల కోట్ల రూపాయలతో నికియా కార్లు పరిశ్రమను తెచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదినీ గుర్తు చేసారు. గతములో మీరు ప్రతిపక్షములో ఉన్నప్పుడు పరిశ్రమరాదు భూములు వెనక్కి ఇప్పిస్తామని తెలపలేదా మీ నాయకుడు శంకరనారాయణ? కియా పరిశ్రమ మా నాయకుడు చంద్రబాబు నాయుడు తెచ్చిన తరువాత సిగ్గులేకుండా మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి తెచ్చారు అనడము సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. అంతేకాకుండా గతములో గొల్లపల్లి రిజర్వాయర్కు రాజశేఖర్ రెడ్డి వెచ్చించిన 9 కోట్లు అప్పటి కాంట్రాక్టర్లు మొత్తం నాకేసి, మిగతా పనులను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వదిలివేసారు. 2014వ సంవత్సరములో పార్టీ అధికారంలోకి రాగానే మానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి గొల్లపల్లి రిజర్వాయర్ లోనే ఉంటూ 18 నెలలలో 100% పనులను పూర్తి చేసి, కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి, అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు . గతములో ఇదే మాదిరిగా సవాలు విసిరి, పెనుకొండ అంబేద్కర్ కూడలిలో చర్చకు రమ్మని చెప్పినా నీ దగ్గర ఆధారాలు లేక చర్చకు రాలేని పిరికిపందవు నువ్వు, నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? తస్మాత్ జాగ్రత్త!
ఈ కార్యక్రమంలో జి వి పి నాయుడు, చిన్నప్పయ్య, సర్పంచ్ శ్రీనివాసులు, రఘువీర చౌదరి, హరీష్ రొద్దం మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img