Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అభివృద్ధి ధ్యేయంగా జగన్‌ పాలన

ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉరవకొండ పట్టణం సివివి నగర్‌ లో నూతన సిసి రోడ్‌ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం పాలన చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సిసి రోడ్లకు నిధులు మంజూరు చేసి గ్రామాల యొక్క రూపు రేఖలను మార్చి వేశారన్నారు ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశారని తెలిపారు.జగన్‌ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఉరవకొండ మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రమణ యాదవ్‌ తో పాటు వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు, యువనేత భీమిరెడ్డి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img