Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అయ్యంపల్లిలో ఎలుగుబంటి హల్చల్‌

విశాలాంధ్ర`కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లా కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఎలుగుబంటి హల్చల్‌ చేసింది. ఇక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తరచూ ఎలుగుబంట్లు గ్రామంలో ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ప్రతిరోజు గ్రామంలోకి రాత్రిపూట ఎలుగుబంట్లు వస్తున్నాయని వాటి బారిన పడి తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటూ బిక్కుబిక్కు మని జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంట్లు రాక గమనించిన స్థానికులు కంటిమీద కునుకు లేకుండా జాగరణ చేస్తున్నారు. గ్రామం మధ్యలోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి ఎలుగుబంటి ప్రవేశించి స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపామని స్థానికులు చెప్పారు. రక్షణ చర్యలు తీసుకుని తమకు ప్రాణహాని నుండి కాపాడాలని అయ్యంపల్ల్లి, అచ్చంపల్లి, కోటగుడ్డం, కురాకులపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img