Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అర్హులందరికీ పింఛన్లు

విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అర్హులైన పేదలందరికీ కూడా కులము మతము రాజకీయాలు చూడకుండా పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని ఉరవకొండ మండలం రేణిమాకులపల్లి సర్పంచ్‌ బోయ రామాంజనేయులు తెలిపారు. గ్రామంలో కొత్తగా మంజూరైన పింఛన్లను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొత్త పింఛన్లు మంజూరు మరియు పింఛన్లు పెంపు వల్ల వృద్ధులు వికలాంగులు, వితంతువులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో కూడా జగనే సీఎం కావాలని పెద్ద ఎత్తున ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. పింఛన్లనే కాకుండా సంక్షేమ పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img