Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి…సీపిఎం

విశాలాంధ్ర-గుంతకల్లు : అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని బుధవారం సిపిఎం పార్టీ నాయకులు తాహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అనంతరం తాహసిల్దార్ బి.రాము కి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బి శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలాలను ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసరి శ్రీనివాసులు, కసాపురం రమేష్, సాకే నాగరాజు, జగ్గిలి రమేష్, రాము నాయక్,మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img