Friday, April 19, 2024
Friday, April 19, 2024

అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

టిడిపి ఆందోళన

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధిదారులకు మంజూరు చేసిన పట్టాలకు స్థలాలు చూపాలని మంగళవారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు కోర్టు కేసుల వల్ల పెండింగ్లో 566 మంది లబ్ధిదారులు మిగిలారని కోర్టు కేసులు పరిష్కరించిన తర్వాత పట్టా పొందిన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు హామీ పత్రాలను ఇవ్వడం జరిగిందని. అయితే ప్రస్తుతం పట్టణంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు566 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వారికి నచ్చిన వారికి ఆ పార్టీ వారికి మాత్రమే పట్టణంలో మిగిలిన ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నారని దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. హామీ పత్రాలు ఇచ్చిన లబ్ధిదారులు అందరికి కూడా న్యాయం చేయాలని టిడిపి పార్టీ నాయకులు పేర్కొన్నారు. లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే దశల వారి ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు పేర్కొన్నారు.అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img