Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అవినీతిని ప్రశ్నిస్తే వైసీపి శ్రేణులు టిడిపి కార్యాలయం పై దాడి చేస్తారా.?

టిడిపి మాజి ఎమ్మెల్యే ఆర్ జితేంధ్ర గౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి చేస్తారని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంధ్ర గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా ఆర్ జితేంధ్ర గౌడ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టిడిపి నేతలపై దాడులు చేస్తూ అక్రమ అరెస్టులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. గన్నవరం టిడిపి కార్యాలయం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులను ప్రజలు ఎప్పటికీ హర్షించరని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల సమయంలో ప్రజలే ప్రభుత్వానికి ఓటు ద్వారా భుద్ది చెప్తారన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మనూరు వెంకటేష్ టిడిపి నాయకులు తలారి మస్తానప్ప జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప,మాజి ఎంపీపీలు అడ్వకేట్ ప్రతాప్ నాయుడు,రాయల్ రామయ్య,హనుమంతు,జింకల జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img