విశాలాంధ్ర`ధర్మవరం : అశేష అభిమానుల హీరో కృష్ణ మృతి తీరని లోటు అని కళాజ్యోతి కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులు నారాయణ, రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు వెంకటనారాయణలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కృష్ణ మృతి సంతాప సభలో రెండు నిమిషాలు మౌనం వహిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. తదుపరి కళా జ్యోతి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేస్తూ, సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకొని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. కృష్ణ మృతిచెందినా,వారి సినిమాలతో, జ్ఞాపకాలతో, చేసిన సేవలతో, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని తెలిపారు. అందరూ ఇష్టపడే ఏకైక హీరో కృష్ణ అని, దాదాపు 350 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోయారని తెలిపారు. కృష్ణ ఆశయ సాధనాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగనమల రామకృష్ణ, రమేష్ బాబు, రాంప్రసాద్, పెద్దారెడ్డి, పళ్లెం వేణుగోపాల్, మోహన్దాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.