Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి

సిపిఐ నియోజకవర్గ నాయకులు చెన్నా రాయుడు
విశాలాంధ్ర-ఉరవకొండ :
వ్యవసాయం గిట్టుబాటు కాక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం నాయకులు చెన్నా రాయుడు అన్నారు. జై కిసాన్‌ ఫౌండేషన్‌ వారు ఆధ్వర్యంలో శుక్రవారం ఉరవకొండలో నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కాపాడుకోవాలని సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని కూడా ఆదుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్వామినాథ కమిటీ ఇచ్చిన నివేదికలలోని అంశాలను ప్రభుత్వాలు అమలు చేయాలని. రైతుల యొక్క ఆత్మహత్యలను నివారించాలని పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలలోని బిడ్డలకు ప్రభుత్వం విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు యొక్క కుటుంబ సభ్యులకు ఆయన తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జై కిషన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img