Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆరోపణలు చేయడం సమంజసం కాదు

విశాలాంధ్ర- బొమ్మనహళ్: దాతల సహకారంతో గ్రామ అభివృద్ధి చేసేవారిని తప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శించడం సమంజసం కాదని బొమ్మనహళ్ మాజీ సర్పంచ్ రమేష్ ఆరోపించారు సోమవారం బొమ్మనహళ్ పాండురంగ స్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్ వన్నమ్మ ఉప సర్పంచ్ హనుమంతప్ప మాజీ మండల ఉపాధ్యక్షులు పయ్యావుల మోహన్ బాబు అనిల్ లు మాజీ సర్పంచ్ రమేష్ పై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు దాతల సహకారంతో గ్రామంలోని పాండురంగ స్వామి దేవాలయానికి అభివృద్ధి చేసినందుకు కృషి చేస్తుంటే వాళ్లు అడ్డుకుంటున్నారని అభివృద్ధిని అడ్డుకోవడ మే కాకుండా అపనిందలు వేయడం అర్ధరహిత ఆరోపణలు చేయడం వారికి పరిపాటి గా మా రి పోయిందని విమర్శించారు బొమ్మన హాల్లో పాత ట్యాంకు ఉన్న రాళ్లను వారే పోలీస్ స్టేషన్ వద్ద డ్రైనేజీ కట్టించి పంచాయతీ నిధులు డ్రా చేసుకున్నారని విమర్శించారు గత సర్పంచ్ ఎన్నికల్లో నా సహకారంతో గెలుపొంది నన్ను విమర్శిస్తున్నా రని బొమ్మనహల్ గ్రామ ప్రజలు నన్ను నమ్మి ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని ఇప్పుడు సర్పంచ్ గా రాజీనామా చేసి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ చేశారు నేను ఏమైనా అక్రమాలకు పాల్పడి ఉంటే పాండురంగ స్వామి గుడిలో చర్చకు రావాలన్నారు నేను ఏ అధికారిని బెదిరించలేదని దేవాలయ అభివృద్ధికి పంచాయతీ అనుమతి ఎందుకని స్మశానంలో కంప చెట్లు తొలగించే సమయంలో పంచాయతీ తీర్మానం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img