జోనల్ చైర్మన్ ఎం.మంజుల
విశాలాంధ్ర`ఉరవకొండ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎం మంజుల అన్నారు. బుధవారం ఉరవకొండ ఆర్టీసీ డిపోను ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అందరూ కూడా దీనిని గమనించాలన్నారు. ఉరవకొండ ఆర్టిసి డిపోలో 49 బస్సులు ఉన్నాయని అన్నీ కూడా పూర్తిస్థాయి కండిషన్లో ఉన్నాయన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది అన్నారు.ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి విలీనం చేయడం పట్ల ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతోంది అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని సౌకర్యాలు కూడా వర్తిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఉరవకొండ ఆర్టిసి డిపోకు కొత్త డిపో మేనేజర్ వచ్చిన తర్వాత డిపోను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఈ డిపోలో సమస్యలు తక్కువగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బాలాజీ దయాల్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు