Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆర్టీసీ కార్మికుల ఫిర్యాదు పైనే విచారణకు రావడం జరిగింది..

విజిలెన్స్ ఎస్సై విజయ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం డిపో ఆర్టీసీ కార్మికులు డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ ఫై ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు పలు ఫిర్యాదులు అందడం జరిగిందని, ఇందు కొరకే డిపోలోని కార్మికులందరికీ విచారించి తగిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపో పై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ఎండి ద్వారా విజిలెన్స్ వారు విచారణ చేయాలన్న ఆదేశాల మేరకే తాము రావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం డిపో మేనేజర్ శ్రీశైలంలో ఆన్ డ్యూటీ లో ఉన్నందున, వారు వచ్చేవరకు పలు కార్మికులతో మరింత విచారణను చేపడతామని తెలిపారు. ఇంకనూ కొన్ని రోజుల వరకు విచారణ కొనసాగిస్తామని, ఫిర్యాదులో కార్మికుల ద్వారా వచ్చిన ఆరోపణలను విచారించి అవి వాస్తవమైతే తగిన వాస్తవ నివేదికను ఎండి కు పంపడం జరుగుతుందన్నారు. కార్మికులపై డిపో మేనేజర్ ప్రవర్తన, ఇంకను కార్యాలయంలోని పలు అంశాలపై కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img