Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపిక

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈ నెల 21వ తేదీ నుండి 27 వ తేదీ వరకు గదగ్, కర్ణాటక లో జరగనున్న జాతీయ సమైక్యతా శిబిరానికి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు బి.ఎస్సి తృతీయ సంవత్సరం చదువుతున్న ఆజామ్, జి.నందిత ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డా.ఏ. సిఆర్ దివాకర రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఐ క్యూ ఏసి కో -ఆర్డినేటర్ డా. అచ్యుతానంద , డా. జయలక్ష్మి, విషప్రియ, సోమశేఖర్, బాలాజీనాయక్ గురుమోహన్, పొలిటికల్ సి సైన్స్ అధ్యాపకుడు ఈశ్వర్రెడ్డి, బోటని విభాగాధిపతి శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ శశాంక మౌళి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img