Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్డిటికి ఎంత సహాయం అందించిన తక్కువే.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఎక్కడో పుట్టి దేశం కానీ దేశం కొచ్చి అనంతపురం జిల్లా ప్రజలకు సేవ చేస్తున్న ఆర్డిటి సంస్థకు తనలాంటివారు ఎంత ఆర్థిక సహాయం అందించిన తక్కువేనని శ్రీ మిద్దె చిన్న పుల్లారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంత పురం జిల్లాలో ప్రభుత్వాలు కూడా చేయని విధంగా జిల్లా అంతట పేద ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందిస్తున్నారు. రైతులకు చెక్ డాములు నిర్మించి నీటి శాతాన్ని పెంచు తున్నారు. పేద రైతులకు పొలాల్లో బోర్లు వేయించి పళ్ళతోటల పంపకానికి సహాయం చేస్తున్నారన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల నెల పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ డి టి సంస్థ ఎన్నటికీ మరువలేని విధంగా అనంతపురం జిల్లా ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. అందులో తన వంతు సహాయంగా పేద ఇద్దరు పిల్లలకు లక్ష ఇరవై వేల రూపాయలు అందించానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img