Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం : నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉపేంద్ర రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా సమాచారాన్ని అందుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి తన వంతుగా 50వేల రూపాయల ను ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. మీ కుటుంబానికి పార్టీ అన్న వేల అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఇదే గ్రామంలో బీసీ కాలనీలో నూతనంగా నిర్మించబోయే రామాలయం దేవాలయమునకు తన వంతుగా 50వేల రూపాయల విరాళం తో పాటు ఎమ్మెల్యే నిధుల కింద ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా ఆలయ కమిటీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ఎమ్మెల్యే భార్య సుప్రియ పట్టణంలోని 36 వ వార్డు కొత్తపేట అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద ఉన్న మీసేవ కేంద్రం వద్ద నుంచి ఇంటింటికి గడపగడపకు అనే కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరును తెలుసుకోవడానికి కూడా తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న లబ్ధి వివరాల కరపత్రాలను కూడా వారు ఇంటింటికి అందజేశారు. తదుపరి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img