Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్ డి టి సెట్టుకు దరఖాస్తు చేసుకోండి

విశాలాంధ్ర – పెనుకొండ : ఆర్ డి టి సంస్థ వారు ఎంతమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివించాలని ఉద్దేశంతో మంచి భవిష్యత్తు నివ్వాలని ఉద్దేశంతో ఈ ఏడాది కూడా 10వ తరగతిలో మంచి మార్కుల సాధించిన వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి 10వ తరగతిలో రాష్ట్రస్థాయి సిలబస్ లో 500 పైన మార్కుల సాధించిన వారు అలాగే సిబిఎస్సి సిలబస్ లో 420 పైన మార్కుల సాధించిన వారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే ఆర్డిటి సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పెనుకొండ ఏరియాలోని పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ,ఓసి, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సంకల్పం ఉన్నవారు పెనుకొండలోని అక్కమ్మ గార్ల కాలనీ ఉన్న ఆఫీసులో తమ దరఖాస్తులు అందజేయవలసి ఉంటుందని వారు 2 ఫోటోలు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు, నెట్ మార్క్స్ కార్డు, తో కూడిన దరఖాస్తు అందజేయలని పె నుకొండ ఏరియా టీమ్ లీడర్ లలిత, కమ్యూనిటీ ఆర్గనైజర్ రామాంజనేయులు, ఒక ప్రకటనలో తెలిపారు ఆఫీసులో సంప్రదించవలసిన నెంబర్లను కూడా తెలియజేశారు 9491355072,8639303308
దరఖాస్తులను విద్యార్థితో పాటు గా, తల్లి గాని ,తండ్రి గాని, స్వయంగా వచ్చి ఆఫీసులో అందజేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img