Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఆలయంలో ఘనంగా హోమాలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని దుర్గా నగర్ లో ఈనెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ శీతల దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా మూడవరోజు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలతో పాటు సహిత దీక్ష , అంగ, మూర్తి హోమాలు వేద పారాయణం యంత్రాభిషేకాలు నవగ్రహ యధాశక్తి జపాలు, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలను పార్నంది ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో జ్యోతిష్య ఆగమ పండితులు రాధా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ హోమాలు పారాయణధులు ఆరు మంది రూట్థ్వీకుల సహకారంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నము, రాత్రి భక్తులకు భోజనాన్ని పంపిణీ చేశారు. తిరిగి సాయంత్రం అన్నమయ్య సేవా మండలి వారికే పంచమా వాయిద్య కార్యక్రమం భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ అభివృద్ధి కమిటీ సాకే చిన్నకృష్ణ ,బెస్త రామకృష్ణ నువ్వు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణముకు121 మంది 5 లక్షల నుండి10,116 రూపాయల వరకు నగదును విరాళంగా ఇచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో గుడి నిర్మాణ సేవాకర్తలు సింగంశెట్టి రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, గౌరవం రాము ,పసులూరి పెద్ద పోతులయ్య, పంకం నాగరాజు, అంకె నారాయణస్వామి, బాబయ్య, ఎర్ర జిన్నెల అశ్వత్థ నారాయణ తోపాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img