విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో ఉన్న బొగురు గుండ్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లో కంప చెట్లను శుక్రవారం తొలగించారు. భక్తులకు సౌకర్యార్థం చేసినట్లు ఆలయ ఈవో కె విజయకుమార్ తెలిపారు. ఆలయం చుట్టూ పెద్ద ఎత్తున పెరిగిన కంపచెట్లను తొలగించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.