విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆశ కార్యకర్తలకు కిల్కరి మొబైల్ అకాడమీ గూర్చి మరియు పొగాకు వినియోగం పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం స్థానిక వినాయక నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆషా డే రోజున వైద్యాధికారి డా.సుస్మిత ఆధ్వర్యం లో నిర్వహించారు. రాష్ట్రంలో కిల్కరీ మొబైల్ అకాడమీ ద్వారా తల్లి బిడ్డల మెరుగైన వైద్య సేవలు గురించి మరియు కిల్కరి టోల్ ఫ్రీ నెంబర్,0124458000,గురించి అవగాహన కల్పించారు తల్లి బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి అమూల్యమైన సమాచారం ఈ నంబర్ ద్వారా మనకు వాయిస్ మెసేజ్ రావడం జరుగుతుందన్నారు, ఈ వాయిస్ మెసేజ్ గర్భవతులు, ఒక సంవత్సరం లోపు తల్లులు కు సమాచారం చేరుతుందన్నారు. అనంత జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. తల్లి బిడ్డ సంరక్షణ కోసం ఆరోగ్య విద్యను అందించేందుకు సంభందిత హెల్ప్ లైన్ నంబరు ఉపయోగపడుతుందన్నారు. పొగాకు వినియోగం వలన కలిగే పరిణామాలను గురించి శ్రీరాములు,డీసీఎం అవగాహనకల్పించారు.
బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసే 200 రూపాయలు జరిమానా విధించను, విద్యా సంస్థలకు నూరు గజాలలోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తుల అమ్మరాదు కొనరాదు ఒకవేళ అమ్మితే అతిక్రమించిన శిక్షార్హులు, సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ కైని, జర్దా మొదలగు పొగాకు పదార్థాలు జీవితంలో వినియోగించమని కార్యక్రమం నకు హాజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.