విశాలాంధ్ర`ధర్మవరం : పట్టణంలోని కొత్తపేట లోని బాలాజీ నగర్ లో యూపీహెచ్సీ పరిధిలోగల ఆశ కార్యకర్త నియామకానికి అర్హత గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు అర్హులని తెలిపారు. ఈ ఆశా కార్యకర్త నియామకానికి మహిళలు పదవ తరగతి ఉత్తీర్ణులై 45 సంవత్సరాల లోపు వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ధర్మవరం పి పి యూనిట్ కార్యాలయము నందు అందజేయాలని తెలిపారు.