విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో అనగా వాసవి జూనియర్ కాలేజ్, ఏపీ మోడల్ కాలేజ్, ప్రభుత్వ బాలుర కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సీతారామయ్య జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరపు విద్యార్థులకు తెలుగు, హిందీ ,సంస్కృతం, ఉర్దూ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా డివి ఈవో రఘునాథరెడ్డి వాసవి కళాశాల, ఏపీ మోడల్ కాలేజ్, ప్రభుత్వ బాలుర కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలోని గదులను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, విద్యార్థులకు తాగునీటి వ్యవస్థ, వెలుతురు, ఫ్యాన్ అన్ని ఉన్నాయా? లేదా? అన్నవి వారు పరిశీలించారు. విద్యార్థులను పరీక్షా సమయంలోనే అనుమతించాలని, ఆలస్యంగా వస్తే అనుమతించరాదని సంబంధిత చీఫ్ సూపర్డెంట్ లను వారు ఆదేశించారు. పరీక్షా గదులలో సీసీ కెమెరా ఏర్పాట్లను చూస్తూ, ఇన్విజిలేటర్లు కూడా ఎటువంటి సెల్ ఫోన్లు కూడా తీసుకొని రారాదని వారు సూచించారు. మొత్తం మీద మొట్టమొదటి రోజు పరీక్షలు సజావుగా నడిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాలలో మొత్తం 1,304 మంది విద్యార్థులు ఉండగా 1,270 మంది హాజరు కాగా 34 మంది అనపర్తి అయినారని తెలిపారు. మొత్తం మీద 97.4 శాతం హాజరు కావడం జరిగిందని వారు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలలో వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా సమయంలో కూడా జిరాక్స్ అంగళ్లు తెరవకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. పోలీసులు కూడా విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఫలానా నెంబర్ కు వెళ్లాలన్న.. సలహా, సూచనలు కూడా ఇవ్వడం విద్యార్థులను ఎంతగానో సంతృప్తిని ఇచ్చారు. మొత్తం మీద మొట్టమొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించబడ్డాయి.