ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర` ఉరవకొండ : పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కుకు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల వైయస్సార్ సీపీ పరిశీలకులు ఎమ్మెల్సీ వై.శివరామరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పేర్లను నమోదు చేసుకున్న వారి పేర్లు ఓటర్ల లిస్టులలో నమోదుచేయబడ్డాయని సదరు ఓటరులిస్టులు ఆన్ లైన్లో మరియు మండల రెవిన్యూ కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని పేర్లు నమోదు కాకుండా ఉన్నట్లయితే వెంటనే పట్టభద్రులు పారం-18 ద్వారా, ఉపాధ్యాయులు ఫారం-19 ద్వారా ఈనెల 9వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు వైయస్సార్ సిపి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూసల రవీంద్రరెడ్డి మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ని గెలిపించి జగన్ యొక్క పాలనను బలపరచారన్నారు.