విశాలాంధ్ర-రాప్తాడు.. మండలంలో రబీ సీజనులో బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ, వరి, అరటి, టమోటాతోపాటు ఇతర కాయగూరల పంటలు సాగు చేసిన రైతులు ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవాలని ఏఓ శుభకర్ తెలిపారు. సోమవారం ఎం.చెర్లోప్లల్లి గ్రామ రైతుల పొలాల్లో ఎంపీఈఓ రాజు ఈ-క్రాప్ బుకింగ్ చేపట్టారు. ఈక్రాప్ బుకింగ్ చేసుకునే రైతులు రైతుపేరు ఆధార్ నంబరు, వన్-బి నంబరు,
పంట వేసిన సర్వే నెంబర్, విస్తీర్ణం, మొబైల్ నెంబర్, పంట పేరు తదితర
వివరాలను ఆర్బీకే సిబ్బందికి అందజేయాలని కోరారు. ఏఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్బీకే విత్తనం మొదలుకుని పంట దిగుబడి చేతికొచ్చే వరకు అన్ని రకాల సేవలందిస్తున్నామన్నారు. అలాగే అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలను అందించాలనే మంజూరయ్యేందుకు ఈ క్రాప్ పేరుతో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామన్నారు. .ఇందులో భాగంగా రైతులు ఏయే పంటలు సాగు చేశారు. ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను ఎంపీఈఓలు, వీఏఏలు, వీహెచ్ఏలు, వీఎస్ఎలు నమోదు చేస్తున్నారన్నారు.