Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉగాది నాటికి గృహ నిర్మాణాలు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వైయస్సార్ జగనన్న కాలనీ లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను శనివారం సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ జగనన్న కాలనీలలో పర్యటించి వివిధ సమస్యలను లబ్ధిదారులతో అడిగి తెలుసుకున్నారు జగన్ అన్న కాలనీలలో 958 గృహాలు మంజూరు కాగా 100 మాత్రమే పూర్తయినాయి 145 రూఫ్ లెవెల్ పూర్తికాగా 120 రూఫ్ లెవెల్లో నిర్మాణంలో ఉన్నాయి వీటిని కాక మిగతా ఇల్లు వివిధ దశలలో నిర్మాణాలలో ఉన్నాయి వీటికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు నగర పంచాయతీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశమై ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ నిర్మాణాలు ఉగాదికి లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుందని లేకపోతే చర్యలు తీసుకోబడునని తెలిపారు లబ్ధిదారులు కరెంటు నీటి సమస్య ఉందని తెలిపారు సమస్యలను సోమవారం రోజు పరిష్కారానికి ఆలోచిస్తామని ఆయన తెలిపారు గృహ నిర్మాణాలు ఉగాదికి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వవలసి ఉంటుందని ప్రభుత్వము యొక్క నిర్దేశిత కాలాన్ని వృధా చేయకుండా పూర్తి చేయాల్సిన అధికారులు అలసత్వం లేకుండా లబ్ధిదారులతో కలిసి పనులు పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సువర్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివశంకరప్ప నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ గృహ నిర్మాణ శాఖఏఈ శ్రీనాథ్ వీఆర్వోలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img