Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉద్యోగులు జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలి

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామ సచివాలయాల ఉద్యోగులు జవాబుదారీగా పనిచేస్తూ… ప్రజలకు మె రుగైన సేవలందించాలని హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఐపీఎస్ సోమవారం రాప్తాడు సచివాలయం-1 ను ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లితో సందర్శించారు. ముందుగా ఉద్యోగుల విధులు, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి…? సచివాలయం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో శాంతిభద్రతలపై మహిళా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో అనంతపురం డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐ మోహన్, ఎంపీడీఓ సాల్మన్, ఎస్ఐ ఆంజనేయులు, సర్పంచ్ సాకే తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img