Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉద్యోగుల సంక్షేమ సంఘం కొరకు కృషి చేస్తాం.. నూతన కమిటీ కార్యవర్గం

విశాలాంధ్ర`ధర్మవరం : పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం కోసం నిరంతరం పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ అధ్యక్షులు ఊట్ల నరేంద్ర, కార్యదర్శి నాగమల్లి సతీష్‌ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవస్థానంలో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్స్‌, డాక్టర్స్‌ ను అందరినీ ఐక్యం చేస్తూ, ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకొని, పద్మశాలి సమాజాన్ని మరింత ముందుకు నడిపించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ నూతన కమిటీలో గౌరవాధ్యక్షులుగా కాంచి దూలప్ప, రాష్ట్ర కార్యదర్శిగా అందేలా మార్కండేయను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పద్మశాలి సమాజంలోని విద్యార్థులను సాహితీ సాంస్కృతిక కళాకారులను చేనేత కార్మికులను అండగా ఉంటూ ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర్‌ అనంతపురం జిల్లా కార్యదర్శి శివ రుద్రప్ప కోశాధికారి సురేష్‌ రాష్ట్ర కార్యదర్శి జగన్నాథ్‌ ధర్మవరం పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగ రయ్య తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img