Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా వసికేరి మహేష్

విశాలాంధ్ర- ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఉరవకొండ తాలూకా అధ్యక్షులుగా వసికేరి మహేష్ ఎన్నికయ్యారు. తాలూకా అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ ఎర్రి స్వామి రెడ్డి ఉన్నత కోర్సు కు వెళ్లడంతో ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవిని జిల్లా అధ్యక్షులు గోపికృష్ణ జిల్లా కార్యదర్శి రాము నాయక్ మహేష్ ను ఎంపిక చేసినట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహేష్ మాట్లాడుతూ తనను తాలూకా ఉద్యోగుల సంఘం అధ్యక్షుల పదవికి ఎంపిక చేసిన జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగుల యొక్క సమస్యలపై తాను రాజీలేని పోరాటాన్ని నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన మహేష్ ను పలువురు ఉద్యోగులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img