Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉద్యోగ మేళాకు విశేష స్పందన… శ్రీనివాస డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్లో గల శ్రీనివాస డిగ్రీ కళాశాల యందు బుధవారం నాడు జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన రావడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి లకు బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ ఉద్యోగ అవకాశాల్ని కల్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వి కే ఆర్ ఫార్మ కంపెనీ వారు కిరణ్, సుశీల్, బాబా ఫక్రుద్దీన్ ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిభ కలిగిన 19 విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, వీరికి చెన్నై,బెంగళూరు నగరాలలో సంవత్సరానికి రెండు లక్షల 50 వేలు వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగమేళా అవకాశాన్ని కల్పించిన చైర్మన్ పల్లె కిషోర్ కు ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తో పాటు విద్యార్థులు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img