వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్
విశాలాంధ్ర/ పుట్లూరు : ఉపాధి హామీ పథకం పక్కాగా అమలు చేయవలసిందేనని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పేర్కొన్నారు. నార్పల మండల పరిధిలోని మూగే తిమ్మంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ, కూలీలకు పనులు కల్పించేందుకు వలసలు వెళ్లకుండా కూలీల ఆకలిని తీర్చేదందుకే 2006వ సంవత్సరంలో ఇదే నార్పల మండలంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని అయితే ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పథకానికి కేటాయించిన డబ్బులను దారి మళ్లించి ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు కూడా చెల్లించలేదన్నారు అలాగే జాబ్ కార్డుకు 150 పని దినాలు 600 రూపాయలు దినసరి కూలీ చెల్లించాలని వీటితోపాటు పని ప్రదేశంలో నీరు,నీడ,ప్రథమ చికిత్స సదుపాయాలతో పాటు ప్రమాద బీమా కూడా చెల్లించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా అధ్యక్షులు రంగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దయ్య, జిల్లా సహాయక కార్యదర్శి సూర్యనారాయణ, నాగరాజు, లక్ష్మీనారాయణ, రాజు, రమేష్, చేపల రామాంజి, గంగాధర్, పెదపెద్దయ్య, నారప్ప, నార్పల మండల రైతు సంఘం అధ్యక్షులు మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు