విశాలాంధ్ర-శెట్టూరు : ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల వలసలు నివారించాలి ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఉపాధి పనులు విస్తృతంగా చేపట్టాలని ఇంచార్జ్ ఎంపీడీవో గంగావతి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మా కొడుకు గ్రామపంచాయతీలో ఉపాధి పనులను పరిశీలించారు మస్టర్ వెరిఫికేషన్ కూలీల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని ఆమె తెలియజేశారు ఈ గ్రామపంచాయతీలో ఏ ఏ పనులు చేపట్టాలి వాటి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని సూచించారు ప్రజలకు ఉపాధి పథకమైన అవగాహన కల్పించి ఎక్కువమంది కూలీలు వచ్చే విధంగా చూడాలని కార్యక్రమంలో ఏ పి ఓ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ హుస్సేన్ పీరా ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు