Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉపాధ్యాయుల షటిల్ టోర్నమెంట్ ను సద్వినియోగం చేసుకోండి..

గిద్దలూరు కృష్ణ ప్రసాద్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని రేగాటిపల్లి రోడ్ ఎంఆర్సి (మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ ఆవరణం) లో సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈనెల 11వ తేదీ నుండి 15 తేదీ వరకు అనగా ఐదు రోజులపాటు ఉపాధ్యాయుల కొరకు షటిల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గిద్దలూరు కృష్ణ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంటులో పాల్గొనేవారు 300 రూపాయలు ప్రవేశ రుసుము చెల్లించాలని, ఈనెల ఏడవ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈనెల 8వ తేదీన టీం సభ్యుల సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందన్నారు, డ్రా తీసే సమయంలో ప్రతి టీం సభ్యులు తప్పక హాజరు కావాలని తెలిపారు. ప్రతి టీం సభ్యులు మేనేజ్మెంట్ కు సహకరించాలని తెలిపారు. ఈ సెటిల్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి పదివేల రూపాయలు, రెండవ బహుమతి 5000 రూపాయలు, మూడవ బహుమతి 2000 రూపాయలు, నాలుగవ బహుమతి వెయ్యి రూపాయలు ఉంటుందన్నారు. బహుమతి దాతలుగా ధర్మవరం మండల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే బాలాజీ, సీతారామయ్య జూనియర్ కాలేజ్ కర్రీస్పాండెంట్ సీతారామయ్య, రవిచంద్ర సిల్క్స్ నిమ్మ చంద్ర అండ్ సన్స్, శ్రీ సాయి కాలేజ్ కర్రస్పాండెంట్ చాంద్ భాషా ,అజంతా టైలర్స్ అధినేత అజంతా కృష్ణ వ్యవహరించనున్నారని తెలిపారు. షటిల్ టోర్నమెంట్ టీం సభ్యులకు టీ షర్టులను, మెమెంటోలను ఁమిస్టర్ 7 ఫ్యాషన్స్ ఁవారైనా వై. వెంకటనారాయణ అండ్ సన్స్ (కిరణ్, అరుణ్, అరవింద్) లు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు 9985256682 కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img