Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉరవకొండలో టిడిపి విజయోత్సవ ర్యాలీ

విశాలాంధ్ర -ఉరవకొండ : రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు విజయం సాధించడంతో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సూచనలతో సోమవారం ఉరవకొండలో టిడిపి. ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకత కనబడుతోందన్నారు. చదువుకున్న విద్యావంతులందరూ కూడా ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఉన్నారని ఈ ఎన్నికల్లో తెలిసిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసిపి ప్రభుత్వాన్ని ఓడించి రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపిని గెలిపించుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img