విశాలాంధ్ర-గుంతకల్లు : నూతనంగా జిల్లా వాల్మీకి సాధికార కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తలారి మస్తానప్పకు మంగళవారం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఆయనకు టిడిపి నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మస్తానప్ప మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ ,మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు సహకారంతో ఈ పదవి అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ కృష్ణ రెడ్డి, జింకల జగన్నాధ్,గిడ్డయ్య, ఫజులు, కసాపురం సర్పంచు అభ్యర్థి ఎస్ .రంజాన్,ఎస్ స్సి సెల్ నియోజికవర్గం కార్యదర్శి చికెన్ జగన్,నల్లదాసరపల్లి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.