Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి..మండల అధ్యక్షుడు మోహన్

విశాలాంధ్ర-గుంతకల్లు : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్ర రెడ్డిని గెలిపించాలని మండల అద్యక్షులు మోహన్ పట్టభద్రులను టీచర్ లను అభ్యర్థించారు. శనివారం ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వైటి చెరువు,తిమ్మాపురం,పాతకొత్తచెరువు,నరసాపురం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కార్యలయాలలో మండల అద్యక్షులు మోహన్ పట్టభద్రులను,టీచర్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్ర రెడ్డి నీ, టీచర్స్ అభ్యర్థి రామచంద్ర రెడ్డి ని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఓబులేష్ ,బాబు రావు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img