విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి పిడిఎఫ్ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి కి, పోతుల నాగరాజు కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని గురువారం పట్టణంలో కే.జీ.బీ.వీ స్కూల్ లో టీచర్స్ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.వినోద్ కరపత్రాలు పంపిణీ చేసి అభ్యర్థించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ నాయకులు కే.మల్లయ్య, మహిళా సమాఖై సంఘం నియోజకవర్గ కార్యదర్శి రామాంజినమ్మ, ప్రజానాట్యమండలి పట్టణ కార్యదర్శి కే.పుల్లయ్య, మహిళా నాయకులు లక్ష్మి, ఏఐఎస్ ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ ,పట్టణ నాయకులు రాజేష్,శిక్షావలి,తదితరులు పాల్గొన్నారు.