ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర` ధర్మవరం : ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్- సి క్రీడా పోటీలలో ధర్మవరం పట్టణానికి చెందిన కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ ఈనెల 6, 7వ తేదీలలో ఉరవకొండ డిగ్రీ కళాశాలలో జరిగిన క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహపరతంగా నిర్వహించబడ్డాయని, సెమీఫైనల్స్ లో ఎస్ఎస్బిఎన్ జట్టుతో ధర్మవరం డిగ్రీ విద్యార్థులు తలబడి,5-1 స్కోరుతో ఓడిరచి, ఫైనల్లో ఆర్ట్స్ కళాశాల తో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో ఓటమితో ద్వితీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. ద్వితీయ స్థానం లో నిలిచిన జట్టు క్రీడా కారులు కెప్టెన్ ఎం. రాజేష్, ఎస్. మద్దిలేటి, ఎస్. అనిల్ కుమార్, డి. వంశీకృష్ణ, ఎస్. కాసిం,కే. సాయి, పీ. నాగరాజు, ఎం. మారుతి, ఎం. జగదీష్, ఎం. చంద్రమోహన్, పి. శ్రీనివాసులు, ఏ. అనిల్ కుమార్ ,జి. మహేష్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఈ క్రీడాకారులను ప్రిన్సిపాల్ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీముల్లా, కిరణ్ కుమార్, గోపాల్ నాయక్, పావని, భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, రామ్మోహన్ రెడ్డి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం వారు క్రీడా విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.