విశాలాంధ్ర ` బొమ్మనహల్ : మండలం లోని లింగదహల్ గ్రామంలో ఎస్సి, ఎస్టీ ప్రజాసమాఖ్య సమస్యలు పరిష్కారం దిశగా ఎస్సి,ఎస్టీ ప్రజాసమాఖ్య వ్యవస్థాపకులు మద్దెలచెరువుమల్లి ఎస్సి, ఎస్టీ పార్లమెంట్ అధ్యక్షుడు బి.రమేష్ ఆదేశాలు మేరకు శనివారం బొమ్మనహళ్ మండలంలో వివిధ గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మండల కమిటీ అధ్యక్షుడు హెచ్.రాజేంద్ర ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ని ఎన్నుకున్నారు లింగ దహళ్ గ్రామ ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య అధ్యక్షులుగా గాది లింగప్ప ఉపాధ్యక్షుడిగా మల్లప్ప కార్యదర్శి విజయ్ ఉప కార్యదర్శి లింగప్ప కోశాధికారిగా ఓబులేసు సభ్యులుగా. తిప్పేస్వామి రామాంజనేయులు ఆనంద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.