విశాలాంధ్ర- ధర్మవరం : ఎస్సీ వర్గీకరణకు బిజెపి రాష్ట్ర పార్టీ నేతలకు తెలపాలని కోరుతూ బుధవారం బిజెపి పట్టణ కార్యదర్శి రాప్తాడు రాముకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి, బూదెప్ప లు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో ఎస్సీ వర్గీకరణ జాప్యాన్ని వదిలి, వెంటనే ఏబిసిడి వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించేలా కృషి చేయాలని వారు కోరారు. బిజెపి రాము మాట్లాడుతూ తమ సమస్యను కేంద్ర బిజెపి ప్రతినిధులకు వెళ్లే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ గజ్జల రామాంజనేయులు, బండారి రామాంజనేయులు, గంగప్ప గారి తిరుమలేశు, తిప్పేపల్లి నారాయణ, సాకే నల్లప్ప, సుధాకర్ పాల్గొన్నారు.