Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపిపిఆర్‌ఈఏ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎం. నాగేంద్ర కుమార్‌ ఎంపిక

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ ఎన్నికలు సోమవారం విజయవాడలో నిర్వహించగా అనంత జిల్లా తాడిపత్రిలో పనిచేస్తున్నటువంటి డి ఈ ఈ, పి ఐ యూ ఎం.నాగేంద్ర కుమార్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులుగా వి. వి మురళీకృష్ణమనాయుడు మాట్లాడుతూ… ముగ్గురు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, ముగ్గురు సహాయ కార్యదర్శిలు,టెక్నికల్‌ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ముగ్గురు జోనల్‌ కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పి సత్యనారాయణ, సి మనోహర్‌ రెడ్డి, పోలూరి ఘటిక చలం,ముత్యాలు, ధనుంజయ్‌,సాయి ప్రసాద్‌, జి ఎన్‌ పవన్‌ కుమార్‌, మల్లికార్జున తదితరులు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img