Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపి హెచ్‌ఎంఒ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లపాటి తిరుపతి నాయుడు

విశాలాంధ్ర`అనంతపురం : రాజమండ్రి పట్టణం అల్లు రామలింగయ్య ప్రభాత్వ హోమియోపతి మెడికల్‌ కళాశాల ఆడిటోరియం నందు ప్రభుత్వ హోమియో వైద్యాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వ హోమియో వైద్యాధికారులు విచ్చేసి, ఆంధ్రప్రదేశ్‌ హోమియో వైద్యాధికారుల సంఘం (ఏపి హెచ్‌ఎంఒ ) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ రాష్ట్ర సంఘం నుంచి అనంత జిల్లాకు చెందిన ఇంచార్జి ప్రభుత్వం సీనియర్‌ వైద్యాధికారి డాక్టర్‌ నల్లపాటి తిరుపతి నాయుడుని రాష్ట్ర ఉపాదక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. నల్లపాటి తిరుపతి నాయుడు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆయుష్‌ శాఖలో పనిచేయుచున్న ప్రభుత్వ ఆయుష్‌ వైద్యాధికారులకు ఆయుష్‌ శాఖ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు మా రాష్ట్ర సంఘం నాయకులతో చర్చించి పరిష్కార దిశాగా చర్యలు తీసుకుంటానని, అనంతపురం జిల్లాలోని హోమియో వైద్యాధికారులకు ఏ సమస్య వచ్చిన వాటిని పరిష్కరించేందుకు తమ సంఘం ద్వారా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం హోమియో వైద్యాధికారులు రాష్ట్ర సంఘంను, తనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img