Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ ఆర్ఎస్ ఫలితాలలో నాగర్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల విజయ దుందుభి

బుధవారం వెలువడిన ఏపీ ఆర్ఎస్ ఫలితాలలో ఎన్పి కుంట మండల కేంద్రంలోని శ్రీ నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ అనపరిచినట్టు ప్రధానోపాధ్యాయుడు మణికంఠ తెలిపారు. దనికొండ లాస్య 50 మార్కులకు 46 మార్కులు సాధించి జిల్లా మొదటి ర్యాంక్ సాధించి నట్లు పాఠశాల కరస్పాండెంట్ కె. నాగరత్నమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 22 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారిలో శీను 10, మనీషా 22, రాఘవ 25, భువనేశ్వరి 30, రామాంజనేయులు 34, ధనుష్ 35, జైనబ్ 42, చారణేశ్వర్ రెడ్డి 49, కీర్తన 57, జశ్వంత్ 63, మహిధర్ 75, కాళేశ్వర 76, జ్ఞానేంద్ర 77, మొక్షిత్ 89, ధార్మిక 95 వ రాంకులు సాధించారని తెలిపారు. జిల్లా స్థాయి మొదటి ర్యాంక్ సాధించిన లాస్యతో పాటు 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు మణికంఠ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img