Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీ ఆర్ జె సి నందు జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై కక్ష సాధింపు

విశాలాంధ్ర- పరిగి : పరిగి మండలంలోని కోడిగెనహాల్లి నందు ఉన్న ఏపీ గురుకుల కళాశాల నందు అవినీతి అక్రమాలు జరుగుతున్నందున నేను ప్రశ్నించినందుకే నన్ను విధుల నుంచి తొలగించారని నాకు న్యాయం కావాలని పరిగి తాసిల్దార్ సౌజన్య లక్ష్మికి శనివారం బాధితురాలు సుజాత వినతి పత్రాన్ని సమర్పించారు కళాశాల నందు కాంటాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి సబితరాణి బయట ఏ ఎమ్ లింగన్న బీఈడీ కాలేజీలో కూడా పనిచేస్తూ ప్రిన్సిపాల్ మరియు సబితరాణి కుమ్మక్కై అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నందున వాటిని ప్రశ్నించినందుకు నన్ను తొలగించారని కావున వాటిపై విచారణ చేయాలని నన్ను కళాశాల నుంచి తొలగించడానికి వారంతకు వారే ఆధారాలు సృష్టించుకుని వారు చెప్పడు విని లేనిమాటలు కల్పించుకొని వారాంతకు వారే సాక్షాలు పుట్టించుకుని నన్ను సెలవు మీద వెళ్ళమని లేని ఆధారాలని పుట్టించుకుని నన్ను తొలగించారని ఆమె తాసిల్దార్ ఎదుట వాపోయారు ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో న్యాయవిచారణ చేయాలని నాకు న్యాయం కావాలని నేను ఎటువంటి ఇబ్బందులకు ఎవరిని గురి చేయలేదని ఎవరిని కులం పేరుతో ప్రశ్నించలేదని నా మీద లేనిపోని ఆరోపణలు చేసి నా తొలగింపకు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కళాశాలకు చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉన్నదని ఆమె తెలిపారు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వారి అక్రమాలు రెండు చోట్ల ఉద్యోగాలు చేసే వివరాలు తెలుస్తాయని వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img