Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఏసు ప్రభువు ప్రాణం పెట్టిన రోజే గుడ్ ఫ్రైడే

విశాలాంధ్ర – ధర్మవరం : ఏసుప్రభువు ప్రాణం పెట్టిన రోజునే గుడ్ ఫ్రైడే అని తెలుపుతారని పాస్టర్ యేసు రత్నం పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిద్ధయ్య గుట్టలో గల షాలేము ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవుల సోదర సోదరీమణుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత ఏసుప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తమ కష్టాలను ప్రార్థన రూపంలో తెలుపుకున్నారు. అనంతరం పాస్టర్ యేసు రత్నం మాట్లాడుతూ ఏసుప్రభువు లాంటి పునీతుడు కేవలం మానవాతీతుడు కాబట్టే ఆ పునీలు ప్రాణం పెట్టిన రోజు శుభశుక్రవారం అవుతుందని తెలిపారు. శారీరక బాధలతో నలిగిపోతున్న అనారోగ్యవంతులను అందరిని స్వస్థ పరిచాడని తెలిపారు. పాప పరిహారార్థం దేవునికి తన ప్రాణాన్ని శిలువపై అప్పగించి ఆరోహణమయ్యాడని తెలిపారు. అంతేకాదు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యాడని బైబిల్ చెబుతుందని తెలిపారు. ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలను క్రీస్తు చనిపోయిన శుక్రవారం రోజున చర్చిలో ప్రార్థిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img