విశాలాంధ్ర`కళ్యాణదుర్గం టౌన్ : మండల పరిధిలోని పులికల్లు గ్రామం నుంచి మల్లికార్జున పల్లి ప్రధాన రహదారిలో ఉన్న కంప చెట్లు తొలగించండి మహా ప్రభు అని విద్యార్థినీ విద్యార్థులు వేడుకోలు. శుక్రవారం ఓ పత్రికా ప్రకటన ద్వారా విద్యార్థులు వేడుకలు వివరాలిలా మా గ్రామం నుంచి సుమారు 30 నుంచి 40 మంది పైగా మల్లికార్జునపల్లి ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నామని రోజు నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ ఉన్నామన్నారు. రోడ్డు ఇరువైపులా కంపచెట్లు వేపుగా పెరిగాయని ద్విచక్ర వాహనం కాలినడకన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వన్యప్రాణులు ఎలుగుబంటిలో చిరుత నక్కలు రోజువారి కనిపిస్తున్నాయన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్కూల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు ప్రజాప్రతిని తమ సమస్యను దృష్టిలో ఉంచుకొని కంపచెట్లు తొలగించాలని విద్యార్థిని విద్యార్థులు వేడుకొన్నారు.