Friday, April 19, 2024
Friday, April 19, 2024

కళ్యాణ మహోత్సవమునకు తరలిరండి.. ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ శర్మ

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో ఈనెల 15వ తేదీ బుధవారం సాయంత్రం 6:30 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమమును నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 15వ తేదీ కళ్యాణ మహోత్సవము 16వ తేదీ గురువారం సాయంత్రం 6:30 గంటలకు పురవీధుల గుండా గ్రామోత్సవమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే వారు నేరుగా ఆలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ యజమానులు, శివదీక్ష మాల ధారణ కమిటీ, కల్యాణోత్సవ ఉభయ దాతలు, భక్తాదుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కావున భక్తాదులు ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో తరలి రావాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img