Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి ఆశయాలను కొనసాగించాలి

రేపు ఆయన 28వ వర్ధంతి

విశాలాంధ్ర -ఉరవకొండ : పేదల పక్షపాతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కామ్రేడ్ రాకెట్ల నారాయణ రెడ్డి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉరవకొండ తాలూకాలోని రాకెట్ల గ్రామంలో జన్మించిన వై. నారాయణ రెడ్డి విద్యార్థి దశ నుండే వామపక్ష భావాలు వైపు ఆకర్షితులయ్యారు. ధనిక రైతు కుటుంబంలో జన్మించిన తన జీవితం పేదల సంక్షేమం కోసం సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి కృషిచేసిన ఆదర్శనీయులు 1945 లో ఉరవకొండలో విద్యార్థుల ఉద్యమంలో పనిచేశారని 1950 సంవత్సరంలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేసి విద్యార్థి సంఘాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరింప చేశారు. దళిత విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ కావాలని నారాయణ రెడ్డి పోరాటాలను నిర్వహించి సాధించుకోవడం జరిగింది విద్యార్థి దశ ముగిసిన తర్వాత కమ్యూనిస్టు రాజకీయాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు 1963 లో అధికశిస్తూ నిర్మూలన కోసం జరిగే సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ కావడంతో గుత్తి సబ్ జైలుకు తరలించడం జరిగింది
ఉరవకొండ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాలలో వ్యవసాయ కూలీలు. పేద రైతులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి. పాఠశాల సంక్షేమ హాస్టల్లో కోసం ఎన్నో పోరాటాలను నిర్వహించి సాధించుకోవడం జరిగింది పార్టీపై నిషేధం అమలైన రోజుల్లో ప్రభుత్వం అరెస్టు చేసి చాలా కాలం జైల్లో పెట్టింది.
రాకెట్ల సింగల్ విండో ప్రెసిడెంట్ గా పనిచేసి రైతులుకి అందుబాటులో అనేక కార్యక్రమాలు చేపట్టారు ఉరవకొండ తాలూకా సిపిఐ పార్టీ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. చల్లపల్లి జమిందార్లపై జరిగిన భూ పోరాటం తర్వాత జరిగిన అతిపెద్ద భూ పోరాటం కౌకుంట్లలో నారాయణ రెడ్డి నాయకత్వంలో జరిగింది.ఈ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులైన చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్. ఆంజనేయ శాస్త్రి నీలం రాజశేఖర్ రెడ్డి, వి కే ఆదినారాయణ రెడ్డి, సదా శివన్ తదితరులు పాల్గొన్నారు ఈ ఉద్యమానికి స్పందించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కౌకుంట్లలో 1200 ఎకరాల భూమిని స్వయంగా. భూ సమారాధన. పేరుతో పేదలకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అప్పటి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి దాసరి నాగభూషణం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొరటాల సత్యనారాయణ కూడా పాల్గొనడం విశేషం ఈ పోరాటం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రతిష్టను మరింతగా పెంచింది దేవాలయ భూములు పంపిణీ కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు
నారాయణ రెడ్డి ఎంతో సౌమ్యుడు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పట్ల శత్రుత్వభావంతో ఉండేవారు కాదు. ఎదుటివారి కష్టాలను తన కష్టాలుగా చూసే సున్నితమైన మనిషి. కమ్యూనిస్టు పార్టీ విధానాలను అమలు చేయడంలో ఆదర్శంగా ఉండేవారు. ప్రజలతో నిత్యం కలిసిపోయి వారు అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ కి వెళ్లడం ఆయన జీవన విధానంగా మారింది. పేదలలో ఆయన పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని భూస్వాములు ఆయనను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీశారు. భూస్వాములు తోడ్పడుతో 1995 మే 24న నారాయణ రెడ్డి తో పాటు వారి కుమారుడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆయనను భౌతికంగా హత్య చేసిన ఆయన పోరాటాల ద్వారా సాధించిన ఫలితాలు ప్రజల పొందుతున్నంతకాలం ప్రజల గుండెల్లో ఆయన జీవించే ఉంటారు.

రేపు ఉరవకొండలో వర్ధంతి కార్యక్రమం

కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఉరవకొండ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.కేశవరెడ్డి తాలూకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు నారాయణరెడ్డి యొక్క అభిమానులు పాల్గొనాలని వారు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img