Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మికులకు వస్త్రదానం

విశాలాంధ్ర-నల్లమాడ : మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ లో పని చేస్తున్న ఛీపర్ , కార్మికులకు శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్మికులకు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు, పురుషులకు వస్త్రాలు , సాయి బాబా క్యాలెండర్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మైలే శంకర్, పార్టీ నాయకులు డాక్టర్ బుట్టి నాగభూషణ నాయుడు, లక్ష్మన్ ,నాగేనాయక్, విరుపాక్షి రెడ్డి, శ్రీనివాసులు, పుట్ల రవి, శీనా, అరవింద్,,రమేష్ నాయుడు,సూర్య వర్ధన్ ,యశ్వంత్ తదితరులు నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img