Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కార్మికుల హక్కులను కాపాడుకుందాం

మేడే బహిరంగ సభను విజయవంతం చేయండి
విశాలాంధ్ర -తనకల్లు : కార్మికుల హక్కులను కాపాడుకొని కార్మికులకు పండగ రోజు మే డే సందర్భంగా ఈ నెల 30న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ మండల నాయకులు పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ టి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ఏ టి సి జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డిలో హాజరవుతారన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కాపాడుకోవడంలో ప్రతి కార్మికుడు ఒక సైనికుడై ముందుకెళ్లాలన్నారు ఏప్రిల్ 30న కదిరిలో అంబేద్కర్ సర్కిల్లో జరిగే మేడే బహిరంగ సభకు కార్మికులు కర్షకులు సిపిఐ సానుభూతిపరులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప రైతు సంఘం కార్యదర్శి ఇక్బాల్ రైతు సంఘం అధ్యక్షుడు చౌడప్ప యాదవ్ రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి కరీముల్లా రమణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img