విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో విపరీతంగా పెరిగిపోయిన కుక్కలు మరియు కోతులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో కోతలు కుక్కలు బెడద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తరచు కుక్కలు కరవడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతుండడంతో నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది కోతలు, కుక్కలను పట్టి బంధించే వారి చేత వీటిని బంధించి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.