Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేజీబీవీ గురుకుల , మోడల్ పాఠశాలల్లో సీట్లను పెంచండి..

గుంతకల్లు ఆర్డిఓ కి ఏఐఎస్ ఎఫ్ వినతి…

విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతపురం జిల్లా లో కేజీబివి మరియు మోడల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లును పెంచాలని సోమవారం గుంతకల్లు ఆర్డిఓ రవీంధ్ర కి ఏఐఎస్ ఎఫ్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా నియోజవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినియులకు చదుకోవడాని అవకాశం కల్పించండని మొరపెట్టుకున్నారు. పల్లెటూరి ప్రాంతాలనుండి విద్యార్థినియులు రనుపోను రవాణా సౌకార్యాలు లేకపోవడంతో విద్యార్థినియులు విద్యకు దూరం అయ్యే పరిస్థితులు వస్తున్నాయన్నారు.కాబట్టి కేజీబీవీ మరియు గురుకుల మోడల్ పాఠశాలలు ఎక్కువ సీట్లను పెంచి విద్యార్థినియులు చదుకోవడాని అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శేక్షవాలి, స్రవంత్ ,ఆక్షేయ్ ,రాము, తేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img